ప్రముఖ జర్నలిస్ట్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత


హైదరాబాద్‌: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుముశారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరులో జన్మించిన ఆయన.. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో వెంకటేశ్వరరావు పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.