కరెంటు బిల్లుల పై అపోహలుంటే 1912 కి ఫోన్ చేయండి -సీఎండీ


 



ఏపీలో విద్యుత్ బిల్లులపై గందరగోళంపై మంత్రులు, అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. బిల్లులు ఎక్కువగా వస్తాయన్నది అపోహ మాత్రమే అంటున్నారు. తాజాగా ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ బిల్లులపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని సీఎండీ నాగలక్ష్మి అంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగానే గత నెల రీడింగ్‌ తీయలేదని.. ఈ నెలలో రెండు నెలల రీడింగ్‌ తీసుకున్నామని చెప్పుకొచ్చారు. 


 



ఒకేసారి రీడింగ్ తీసినా.. ఏ నెలకు ఆ నెల బిల్లుగానే లెక్కించామంటున్నారు సీఎండీ. ఏ బిల్లు పెరగలేదని.. వేసవి కాలంతో విద్యుత్‌ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందంటున్నారు. ప్రజలు అపోహలకు గురి కావొద్దంటున్నారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్‌ విధానంలోకి తీసుకు వచ్చామని.. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేలా టారిఫ్‌ తీసుకు వచ్చామన్నారు. గతంలో ఏడాది మొత్తం ఒకటే టారిఫ్‌ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్‌ అమల్లో ఉండేదంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా కరెంట్‌ బిల్లులు పెరిగినట్లు అనుమానాలు ఉంటే వెబ్‌సైట్‌ ద్వారా క్రాస్ చెక్‌ చేసుకోవచ్చంటున్నారు. ఒకవేళ ఇంకా ఏవైనా క్లారిటీ కావాలంటే 1912 కాల్‌ సెంటర్‌‌కి ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. కరెంట్‌ బిల్లులు చెల్లించడానికి జూన్‌ 30వరకూ అవకాశం ఉందన్నారు నాగలక్ష్మి.