మరోవైపు గ్యాస్ లీకేజీ జరిగిన విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో నేడు డిజిపి గౌతమ్ సవాంగ్ పర్యటించనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితుల్ని కూడా ఆయన పరామర్శించనున్నారు. గ్యాస్ లీకేజ్ ప్రాంతంలో పరిస్థితులను డీజీపీ పర్యవేక్షించనున్నారు. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో ఇప్పటివరు 12 మంది మృతి చెందారు. మరికొందరు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్నారి కూడా ఉండటం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. పెద్ద ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మరణాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడిందని చెప్పాలి. అధికారులు అప్రమత్తం అవ్వడంతో మరణాల సంఖ్య తగ్గింది.
అయితే ఈ దుర్ఘటనలో గ్రీష్మ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ఆమె తల్లి తండ్రులు కూడా గ్యాస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మార్చురీ నుంచి 5 మృత దేహాలను అధికారులు ఇవాళ స్వస్థలాలకు పంపించారు. దీనితో గ్రీష్మ మృతదేహం చూసిన ఆమె పిన్ని బాబాయ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తల్లి తండ్రులకు కూడా హె కడ చూపు దక్కకపోవడం స్థానికుల చేత కూడా కంటతడి పెట్టిస్తోంది.