కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారిని అడ్డుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు మినహాయింపునిచ్చింది. అలాగే దాదాపు రెండు వారాల పాటు పేదలు ఇళ్లకే పరిమితి కావాల్సి ఉన్నందున వారిని ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యి నగదుతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు, కిలో పప్పు సరఫరా చేయనుంది. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను సైతం నిలిపివేసింది. అలాగే నిత్యావసర వస్తువుల విక్రయం, రవాణాపై సడలింపు ఇచ్చింది.
ప్రభుత్వం మినహాయించిన సేవలివే..
ఆహారం, సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, చేపల రవాణా
గిడ్డంగులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, కళ్లజోళ్ల దుకాణాలు
టెలికం, ఇంటర్నెట్ సేవలు
కరోనా నియంత్రణ కార్యాకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు
పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి రవాణా
ఔషధ తయారీ వాటి రవాణా కార్యాలయాలు
నిత్యావసర తయారీ యూనిట్లు, వాటి సరఫరా
పోలీసు, వైద్య, ఆరోగ్యం, పట్టణ, స్థానిక సంస్థలు..
అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు..
బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా
ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను ఈ కామర్స్ సైట్ ద్వారా పొందే అవకాశం
తప్పనిసరిగా ఉత్పత్తి , తయారు చేయాల్సిన సంస్థలు ఏమైనా ఉంటే వాటి మినహాయింపు కోసం కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.